Breaking News

భార్యపై అనుమానంతో సైకోగా మారిన భర్త.. రోకలిబండతో కొట్టి హత్య


పచ్చటి సంసారంతో అనుమానం చిచ్చురేపింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను రోకలిబండతో కొట్టి కిరాతకంగా చంపేసిన ఘటన జిల్లా మండలంలో గురువారం జరిగింది. బుక్కపట్నం మండలం పి.కొత్తకోటకు చెందిన జయరామ్, లలిత(32) దంపతులు ఓ తోటలో పనిచేసేందుకు మూడు రోజుల క్రితం తుంపర్తికి వచ్చారు. లలిత తల్లిదండ్రులు గంగాద్రి, కేశమ్మ కూడా కొంతకాలంగా ఇదే తోటలో పనిచేస్తున్నారు. వారితో సలహాతోనే ఇద్దరూ ఇక్కడికి వచ్చారు. Also Read: అయితే లలితపై కొన్నాళ్లుగా అనుమానం పెంచుకున్న జయరామ్ ఆమె ఎవరితో మాట్లాడినా అక్రమ సంబంధాలు అంటగట్టి వేధించేవాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం తోటలో పనిచేస్తుండగా భార్యభర్తలు మరోసారి గొడవపడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన జయరామ్ రోకలిబండతో లలిత తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెను స్థానికులు ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది. లలిత తండ్రి గంగాద్రి ఫిర్యాదు మేరకు ధర్మవరం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు జయరామ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read:


By August 21, 2020 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-kills-wife-in-dharmavaram-anantapur-district-over-suspects-illegal-affairs/articleshow/77667020.cms

No comments