Breaking News

అత్తమామలను చితకబాదిన చిన్నకోడలు.. తూ.గో. జిల్లాలో దారుణం


ఇన్నాళ్లూ కోడలిని వేధిస్తూ చిత్రహింసలూ పెట్టే అత్తమామలనే చూస్తూ వచ్చాం. కానీ జిల్లాలో మాత్రం ఓ కోడలి కిరాతకురాలిగా మారి అత్తమామలతోనే హింసిస్తూ పైశాచికానందం పొందుతోంది. వృద్ధాప్యంలో ఉన్న వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. నిత్రం కొడుతూ తిండి కూడా సరిగ్గా పెట్టుకుంటా వేధిస్తోది. కోడలు పెట్టే బాధలు భరించలేక ఆ దంపతులు పోలీసులను ఆశ్రయిస్తే కరోనా కారణంగా ఇలాంటి చిన్న కేసులు చూడటం లేదంటూ వారు సమాధానమిచ్చారు. దీంతో తమకు న్యాయం చేసేదెవరంటూ బాధితులు దీనంగా చూస్తున్నారు. Also Read: తూర్పగోదావరి జిల్లా కాజులూరు మండలం కుయ్యేరు గ్రామానికి చెందిన నందికోళ్ల సత్యనారాయణ, చిట్టితల్లి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు కొన్నాళ్ల క్రితమే చనిపోవడంతో వారిద్దరు చిన్న కొడుకు, కోడలితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఏడాదిగా అత్త, కోడలి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో కొడుకు, కోడలు వారిపై భౌతికదాడికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చిట్టితల్లికి తలపై బలమైన గాయం కావడంతో రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆస్పత్రి నుంచి వచ్చిన కొద్దిరోజులకే కోడలు మళ్లీ గొడవ పెట్టుకుని అత్తను వెదురు కర్రతో తలపై కొట్టింది. Also Read: దీంతో సత్యనారాయణ తన భార్యను స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కుట్లు వేయించాడు. కొడుకు, కోడలు పెట్టే బాధలు భరించలేక వారు కాజులూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా కరోనా సమయంలో తాము ఇలాంటి ఫిర్యాదులు తీసుకోలేమంటూ తిరిగి పంపించేశారు. దీంతో మకు న్యాయం చేయాలంటూ ఆ దంపతులు స్థానికులను వేడుకుంటున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఎస్ఐ పవన్‌కుమార్ స్పందిస్తూ.. వృద్ధ దంపతుల ఫిర్యాదుపై తాము కేసు నమోదు చేయని మాట వాస్తవమేనని, అయితే వారి కొడుకు, కోడలిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని తెలిపారు. Also Read:


By August 17, 2020 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-attacked-on-her-in-laws-in-east-godavari-district/articleshow/77582272.cms

No comments