Breaking News

అమరావతి: కామాంధుల నుంచి యువ‌తిని కాపాడిన 'దిశ' యాప్


రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్ ఓ యువతిని కాపాడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఉండవల్లి– కరకట్ట మార్గంలో స్కూటీపై వెళ్తున్న యువ‌తిని నలుగురు యువకులు వెంబడిస్తున్నారని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు స‌మాచారం అందింది. దీంతో సీఐ అంకమ్మరావు వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి యువ‌తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెంట‌క‌పాలెం స‌మీపంలో యువతి ఆచూకీ లభించడంతో పోలీసులు ఆమెను రక్షించి వివరాలు సేకరించారు. Also Read: విజ‌య‌వాడ‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతికి ఇటీవల కుటుంబసభ్యులు వివాహం నిశ్చయించారు. అయితే ఆ పెళ్లి ఆమెకు ఇష్టం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. దీంతో మంగళవారం రాత్రి స్కూటీపై ఇంటి నుంచి బయలుదేరి ప్రకాశం బ్యారేజీపై నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా వెంకటపాలెం ఇసుక క్వారీ వరకు వెళ్లింది. అదే సమయంలో అక్కడ మద్యం తాగుతున్న నలుగురు యువకులు ఆమెను గమనించి బైకులపై వెంబడించారు. Also Read: దీంతో భయపడిన యువతి ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు వెంటనే ఆమెకు ఫోన్ చేసి ఎక్కడ ఉందో ఆరా తీశారు. ఆమె పోలీసులతో మాట్లడుతోందని తెలుసుకున్న యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. కాసేపటికు యువతి వద్దకు చేరుకున్న పోలీసులు ఆమెను విచారించి వివరాలు సేకరించారు. ఆత్మహత్య చేసుకునేందుకు వెంట తెచ్చుకున్న శానిటైజర్ బాటిల్‌ను స్వాధీనం చేసుకుని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. Also Read:


By August 13, 2020 at 10:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/andhra-pradesh-disha-app-rescued-young-woman-in-amaravati/articleshow/77517555.cms

No comments