Breaking News

సంతానం కోసం రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య


వారిద్దరూ తెలిసీ తెలియని వయసులో ప్రేమించుకుని పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లపాటు కాపురం సజావుగానే సాగింది. అయితే పెళ్లయి పదేళ్లయినా పిల్లలు పుట్టడం లేదన్న కారణంతో భర్త రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన జిల్లా మండలంలో జరిగింది. యాంకి గ్రామానికి చెందిన నర్సింగమ్మ(25)ను అదే గ్రామానికి చెందిన మాణిక్యప్ప పదేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరి వివాహాన్ని పెద్దలు అడ్డుకున్నా ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. Also Read: గ్రామంలో ఉపాధి లేకపోవడంతో హైదరాబాద్‌‌కు వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం గ్రామానికి వచ్చేశారు. అయితే ఇన్నాళ్లయినా పిల్లలు కలగకపోవడంతో మాణిక్యప్ప భార్యను వేధించేవాడు. ఆమె దళితురాలు కావడంతో తరుచూ కుల ప్రస్తావన తెచ్చి నానా మాటలు అనేవాడు. గురువారం దంపతుల మధ్య గొడవ జరగ్గా.. సంతానం కోసం తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు మాణిక్యప్ప చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన నర్సింగమ్మ శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. Also Read: ఉదయం నిద్రలేచేసరికి విగతజీవిగా పడివున్న భార్యను చూసి కంగారుపడిన మాణిక్యప్ప వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చాడు. వారు వెంటనే అక్కడికి చేరుకుని నర్సింగమ్మ మృతదేహాన్ని చూసి విలపించారు. రెండో పెళ్లి కోసం భర్తే ఆమెను చంపేశాడంటూ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. సమగ్ర విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో నర్సింగమ్మ కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌ ఆస్పత్రికి తరలించారు. Also Read:


By August 02, 2020 at 12:05PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/husband-ready-to-second-marriage-woman-commits-suicide-in-medak-district/articleshow/77312211.cms

No comments