Breaking News

మూడు వ్యాక్సిన్‌లు తుది దశలో... కరోనాపై మోదీ శుభవార్త


పంద్రాగస్టు సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. ఎర్రకోట వద్ద భద్రతా దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడారు. దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌పై మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. కరోన కష్టకాలంలో మనం కొత్త దారులు వెతుక్కున్నామన్నారు ప్రధాని కరోనా వ్యాక్సిన్‌పై కూడా నరేంద్ర మోదీ ఓ శుభవార్త చెప్పారు. కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామన్నారు. వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు కూడా కష్టపడుతున్నారన్నారు. త్వరలో వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. మూడు వ్యాక్సిన్ లు తుది దశలో ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి త్వరలోనే ఫలిస్తుందన్నారు. ప్రతీ పౌరుడికి హెల్త్ ఐడీ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా వచ్చి ప్రజల్ని పీడిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కరోనాతో పాటు దేశ వ్యాప్తంగా వరదలు కూడా చుట్టుముట్టాయన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో దేశం మరో అడుగు వేయడానికి సిద్ధమైందన్నారు ప్రధాని. Read More: ఎన్నో రంగాలపై, ఎంతో మందిపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపిందన్నారు ప్రధాని మోదీ. ఈ కరోనాపై పోరాటంలో మనం సంకల్ప శక్తితో విజయం సాధించగలమనే నమ్మకం ఉందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు కలసికట్టుగా ముందుకు సాగుతూ... విజయం సాధించాలన్నారు. కొత్త ఉత్సాహం, కొత్త ప్రేరణతో ముందుకువెళ్లాలన్నారు. ఓవైపు కట్టుదిట్టమైన భద్రత... మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తసుమారు 4 వేల మంది అథితులు హాజరయ్యారు. అదే స్థాయిలో భద్రతా సిబ్బంది కూడా మోహరించారు.


By August 15, 2020 at 09:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/today-three-vaccines-are-in-testing-stages-in-india-pm-narendra-modi-at-the-red-fort/articleshow/77557800.cms

No comments