Breaking News

కడప: మేనమామతో పెళ్లి.. మరుసటి రోజే ప్రియుడితో పరార్, భర్త అఘాయిత్యం


పెళ్లయిన మరుసటి రోజే భార్య ప్రియుడితో వెళ్లిపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జిల్లా మండలంలో జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి తన అక్క కూతురితో ఆగస్టు 15వ తేదీన వివాహం జరిగింది. అయితే ఆదివారం సాయంత్రం సమయంలో పెళ్లికూతురు కనిపించకుండా పోవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. గ్రామంలోని ఆమె స్నేహితులు, బంధువుల ఇంట్లో గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో పెళ్లికొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: ఈ నేపథ్యంలోనే పెళ్లికూతురు ప్రియుడితో కలిసి సోమవారం పుల్లంపేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుంది. తాను ఓ యువకుడిని ప్రేమించానని, తల్లితండ్రులు తన ఇష్టానికి వ్యతిరేకంగా మేనమామతో పెళ్లి చేయడంతోనే పారిపోయినట్లు పోలీసులకు చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు స్టేషన్‌కు చేరుకున్నారు. మేనమామ కట్టిన తాళిని తీసేసి ప్రియుడితో ఆమె తాళి కట్టించుకుని కనిపించడంతో అందరూ షాకయ్యారు. తాను ప్రియుడిని పెళ్లి చేసుకున్నానని, అతడితోనే కలిసి జీవిస్తానని యువతి తెగేసి చెప్పింది. Also Read: ఈ విషయం ఊరంతా తెలిసిపోవడంతో ‘వాడి పెళ్లాం పారిపోయింది’ అంటూ చాలామంది యువకుడిని ఎగతాళి చేశారు. ఆ అవమానం తట్టుకోలేకపోయిన అతడు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా బంధువులు గమనించి కాపాడారు. అమ్మాయిని మొదట తాళి కట్టిన మేనమామకు అప్పగించాలా? రెండోసారి తాళి కట్టిన ప్రియుడితో పంపించాలా? అని కాసేపు పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. అయితే వధువు మేజర్ కావడంతో ఎవరితో ఉండాలన్నది ఆమెకే అవకాశం ఇచ్చారు. తాను ప్రియుడితోనే కలిసి ఉంటానని యువతి చెప్పడంతో సమస్య అక్కడితో సద్దుమణిగింది. Also Read:


By August 18, 2020 at 07:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/newly-married-bride-eloped-with-boyfriend-in-kadapa-district/articleshow/77603705.cms

No comments