Breaking News

బీఎస్ఎఫ్ డైరెక్టర్‌ జనరల్‌గా రాకేశ్ ఆస్తానా


వివాదాస్పద ఐపిఎస్ అధికారి రాకేశ్ ఆస్తానాకు మరో కీలక పోస్టింగ్ ఇచ్చింది కేంద్రం. ( బి.ఎస్.ఎఫ్) డైరెక్టర్ జనరల్ గా నియమించింది మోదీ సర్కార్. ప్రస్తుతం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఛీఫ్ గా ఉన్న రాకేశ్ ఆస్తానాను డైరెక్టర్ జనరల్ ని చేశారు. సిబిఐ మాజీ అధికారి అయిన అప్పటి తన బాస్ అలోక్ వర్మతో రెండేళ్ల క్రితం బాహాటంగానే గొడవపడడంతో వివాదాస్పదం అయ్యింది. ఆ తర్వాత, ఓ లంచం కేసులో రాకేశ్ ఆస్తానా ప్రమేయం ఉందనే ఆరోపణలపై సుదీర్ఘ విచారణ జరిగింది. గత ఫిబ్రవరిలో రాకేశ్ ఆస్తానా నిర్దోషి అంటూ సీబీఎఐ క్లీన్ చిట్ ఇచ్చింది. 2018లో హైదరాబాద్ కు చెందిన వ్యాపారి సతీశ్ సానా చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసును ఆధారం చేసుకుని రాకేశ్ ఆస్తానా మీద అప్పటి సిబిఐ ఛీఫ్ అలోక్ వర్మ కేసు నమోదు చేశారు. ఈయన 1984 బ్యాచ్ కు చెందిన గుజరాత్ క్యాడర్ ఐపిఎస్ అధికారి, 2014లో బిజేపి నేతృత్వంలో ఎన్.డి.ఏ కేంద్రంలో అధికారంలోకి రాగానే సిబిఐ స్పెషల్ డైరెక్టర్ గా నియామకం అయ్యారు. రాకేశ్ ఆస్తానా నియామకంపై అధికారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాకేశ్ ఆస్తానా నియామకాన్ని అప్పటి సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ వ్యతిరేకించారు. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్తానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడం అప్పట్లో దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను సీబీఐ నుంచి తొలగించారు. Read More: రాకేశ్ ఆస్తానా ప్రధానికి అత్యంత ఇష్టమైన అధికారి అంటూ రాహుల్ గాంధీ కూడా అప్పట్లో విమర్శించారు. 2019 జనవరిలో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ గా రాకేశ్ ఆస్తానా నియామకమయిది. గత ఏడాది ఆగస్టులో ప్రధాని నేతృత్వంలోని "క్యాబినెట్ కమిటీ ఆన్ అప్పాయుంట్మెంట్స్" రాకేశ్ ఆస్తానా ను "నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో" ఇంచార్జ్ గా, తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాణా కుంభకోణంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ఆస్తానానే అరెస్ట్‌ చేశారు. అప్పట్లో ఆయన ఎస్పీగా ఉన్నారు.


By August 18, 2020 at 08:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/rakesh-asthana-appointed-chief-of-border-security-force/articleshow/77603786.cms

No comments