Breaking News

నెల్లూరు: అర్ధరాతి మహిళ దారుణ హత్య.. ప్రియుడు పరార్, హంతకులెవరో?


జిల్లాలో గిరిజన మహిళ దారుణ హత్యకు గురైంది. గ్రామీణ మండల పరిధిలోని ఆముదాలదిన్నె గ్రామ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. దీంతో కావలి డీఎస్పీ ప్రసాద్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆముదాలదిన్నె గ్రామానికి చెందిన నంబూరు శేషమ్మ(43) ప్లాస్టిక్‌ సీసాలు, చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది. గ్రామ సమీపంలో బ్రిడ్జి వద్ద పొలాల్లో చిన్న గుడిసె వేసుకుని అక్కడే ఉంటోంది. Also Read: ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను చంపేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్దిరోజులుగా ఆమె ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోందని, అతడు ఇప్పుడు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. శేషమ్మను అతడే చంపేసి పరారయ్యాడా? లేక ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఎవరైనా అత్యాచారానికి యత్నించి చంపేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు దొరికితే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. Also Read:


By August 18, 2020 at 07:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tribal-woman-brutally-murdered-in-nellore-district/articleshow/77603510.cms

No comments