ప్రకాశం: మూడు రాష్ట్రాల్లో మూడు పెళ్లిళ్లు.. కిలేడీ స్వప్నకు రిమాండ్

అమాయక యువకులకు ప్రేమ వల విసిరి పెళ్లి చేసుకున్నాక అంతా దోచుకుని ప్లేటు ఫిరాయిస్తున్న తిరుపతికి చెందిన కిలేడీ పతంగి స్వప్న అలియాస్ పతంగి హరిణి అలియాస్ నందమురారి స్వప్నను పోలీసులు శుక్రవారం న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న స్వప్న తన భర్తయిన దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన విప్పర్ల రామాంజనేయులు తనను వదిలిపెట్టి విదేశాలకు వెళ్లిపోయాడని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో ఉండగానే స్వప్న గతంలో మూడు వివాహాలు చేసుకొని తన కొడుకును మోసం చేసిందని రామాంజనేయులు తండ్రి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Also Read: దీంతో ఆమె బాగోతాలపై విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. స్వప్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహరాష్ట్రల్లో పేర్లు మార్చుకుని ముగ్గురిని వివాహాలు చేసుకుందని, కొద్దిరోజుల తర్వాత వారిపైన కూడా కేసులు పెట్టి దొరికినంత దోచుకుని పరారైందని నిర్ధారించారు. దీనికి తోడు చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని నిజామాబాద్, హైదరాబాద్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి పలువురు వద్ద నగదు తీసుకుని మోసం చేసినట్లు కూడా విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్ విధించడంతో స్వప్నను జైలుకు తరలించారు. Also Read:
By August 29, 2020 at 09:36AM
No comments