Breaking News

భద్రాచలం: ఇంట్లో నిద్రపోతున్న యువతిపై అత్యాచారం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడకు చెందిన శైలేశ్‌ అనే వ్యక్తికి భద్రాచలంలో బంధువులు ఉన్నారు. దీంతో ఇక్కడికి తరుచూ రాకపోకలు సాగిస్తుండేవాడు. ఇటీవల బంధువుల ఇంటికి వచ్చిన శైలేష్ పక్కింట్లో ఒంటరిగా నిద్రిస్తున్న యువతిపై కన్నేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి దూకి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు శైలేష్ బంధువులను నిలదీశారు. Also Read: దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. శైలేష్ గురించి అడిగితే అతడి బంధువులు తమపై దురుషుగా ప్రవర్తించి దాడి చేసేందుకు యత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు శైలేష్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించిన యువతికి న్యాయం జరిగేలా చూడాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. Also Read:


By August 09, 2020 at 07:45AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-rapes-young-woman-while-she-sleeping-in-badrachalam/articleshow/77440734.cms

No comments