నల్గొండలో రెచ్చిపోయిన దొంగలు.. ఎస్ఐ ఇంట్లో రూ.20లక్షల చోరీ

జిల్లా కేంద్రంలో దొంగలు పోలీసులకే షాకిచ్చారు. ఏకంగా ఎస్ఐ ఇంటికే కన్నమేసి రూ.20లక్షల విలువైన సొత్తు దోచుకుపోయారు. నల్గొండలోని దేవరకొండ రోడ్డు న్యూ చైతన్యపురి కాలనీలో ఎస్ఐ లాక్యానాయక్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. ఆయన భార్య ఇస్లావత్ సువర్ణ, కూతురు శ్రీలత ఈనెల 6న వ్యక్తిగత పని మీద హైదరాబాద్కు వెళ్లారు. Also Read: ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న దుండగులు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. మారుతాళంతో బీరువా తెరిచి అందులో ఉన్న 20.25 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.8.50 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని చూసిన చుట్టుపక్కల వారు సువర్ణకు సమాచారం ఇచ్చారు. Also Read: దీంతో ఆమె వెంటనే హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్నారు. బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి, వన్టౌన్ సీఐ నిగిడాల సురేష్, క్లూస్టీమ్ సిబ్బంది పరిశీలించారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సురేష్ తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసు ఇంట్లోనే దొంగతనం జరగడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. Also Read:
By August 09, 2020 at 08:04AM
No comments