Breaking News

అయోధ్యతో కొరియాకు విడదీయలేని అనుబంధం.. కిమ్ వంశానికి అమ్మ అయోధ్య యువరాణి


అయోధ్య, కొరియా మధ్య అనేక శతాబ్దాలుగా విడదీయలేని అనుబంధం ఉంది. క్రీ.శ. 48లో అయోధ్య చెందిన సూరి రత్న అనే యువరాణి సముద్ర మార్గంలో ప్రయాణించి కొరియా చేరుకుంది. సముద్ర మార్గంలో రెండు చేపలు ముద్దాడుకుంటున్న ఓ శిల్పాన్ని తనవెంట తీసుకెళ్లిన సూరి రత్న.. ఆ రాయి ఓడలో ఉంటే ఆ ఆటుపోట్లను తగ్గిస్తుందని ఓ నమ్మకం. అక్కడికి చేరుకున్న తర్వాత తను పేరును హో వాంగ్ ఓక్ అని మార్చుకుని, ఓ కారా వంశానికి చెందిన తొలి రాజు కిమ్‌ను వివాహం చేసుకుంది. వీరికి పది మంది పిల్లలు కాగా.. వారి సంతానమే కిమ్‌హే కిమ్ పరంపర. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలలో ఈ కిమ్ వంశస్తులే అధికం. అప్పుడు కొరియా ఒక్కటిగే ఉండేది. సూరి రత్న తన వెంట తీసుకెళ్లిన రాయినూ కిమ్ హే అనే ఓ ఆర్కియాలజిస్టు పరిశోధనలు చేశారు. అసలు ఇలాంటి రాయి కొరియాలో ఉండదని సందేహం రావడంతో శోధించాడు. చరిత్రలను తిరగేసి కొరియాను పాలించిన కారా రాజులకూ, అయోధ్యలోని మిశ్రా రాజులకూ సంబంధం ఉందని గుర్తించాడు. హన్యాంగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ బూయంగ్ మో కిమ్ 2010లో మాట్లాడుతూ.. ‘భారత్, కొరియాలు సరుకులనే కాదు, జన్యువులను కూడా పంచుకునేవి.. కారా వంశానికి అమ్మ అయోధ్య నుంచి సముద్రమార్గంలో వచ్చింది.. అందుకే అయోధ్య అంటే మా అమ్మగారిల్లు.. ఉత్తరప్రదేశ్‌లో బాగా ప్రాచుర్యంలో ఉండే రెండు చేపల ముద్రలకూ, రెండు కొరియాల్లోనూ అధికంగా కనిపించే ఈ బొమ్మలకూ సంబంధం అదే.. తరాలకొద్దీ కొరియన్లు రాముడిని కొలిచేవారు కూడా’ అని అన్నారు. భారత్‌లో ఈ బంధం గురించి అంతగా తెలియకపోయినా, ఉభయ కొరియాల్లో మాత్రం పాపులర్. దశాబ్దం కిందట 2010లో దక్షిణ కొరియా టీవీ ఓ ధారావాహికాన్ని ప్రసారం చేసింది. 2001లోనే వంద మంది కొరియన్ ప్రతినిధుల బృందం అయోధ్యకు వచ్చి, అప్పటి తమ రాణి పేరిట సరయూ నది తీరంలో ఓ స్మారకాన్ని నిర్మించారు. దక్షిణ కొరియా మాజీ ప్రధాని కిమ్ జాంగ్‌ పిల్‌ 2001లో ఆయన అయోధ్య రాజ వంశీయుడైన భిమ్‌లేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రాకు ఓ లేఖ రాశారు. అదే ఏడాది మార్చిలో చేపట్టిన భారత పర్యటన తనకెంతో ప్రత్యేకమని కిమ్ తెలిపారు. అయోధ్యలో పర్యటించాలనే నా కోరిక నెరవేరిందని కిమ్ చెప్పారు. సూరి రత్న, కింగ్ సురో వారసుల్లో ఆయన 72వ తరానికి చెందినవాడిగా కిమ్ చెప్పుకొచ్చారు. అందుకే ఆయనకు అయోధ్య అంటే ప్రత్యేక అభిమానం. చాలా మంది కొరియన్లు ఇప్పటికీ అయోధ్యను తమ పుట్టినిల్లుగా భావిస్తారు. అందుకే ఏటా వందలాది మంది కొరియన్లు అయోధ్యను సందర్శిస్తుంటారు. తాజాగా, అయోధ్యతో తమకున్న అనుబంధాన్ని భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంగ్‌కిల్ సోమవారం గుర్తుచేసుకున్నారు. చరిత్ర ఆధారంగా రాజు కిమ్ సురోను భారతీయ యువరాణి వివాహం చేసుకుందని అన్నారు. ‘అయోధ్యకు కొరియాతో ముఖ్యమైన సంబంధాలు ఉన్నాయి. కొరియా పురాతన చరిత్ర పుస్తకంలో, అయోధ్యకు చెందిన ఒక యువరాణి కొరియా రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నట్లు రాశారు’అని ఆయన తెలిపారు. ‘రాజు సమాధి వద్ద పురావస్తు పరిశోధనలల, అయోధ్యకు చెందిన కళాఖండాలు బయటపడ్డాయి’ అని అన్నారు.


By August 05, 2020 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ayodhya-relations-with-south-korea-princess-from-ayodhya-married-a-korean-king-kim-suro/articleshow/77363813.cms

No comments