కర్నూలు గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరి అరెస్ట్.. ఎస్ఐకి షాకిచ్చిన ఉన్నతాధికారులు
జిల్లా మండలంలో గిరిజన మహిళపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వెలుగోడు మండలానికి చెందిన గిరిజన వ్యక్తి గాలేరు వంతెన వద్ద రెండేళ్లుగా వాచ్మెన్గా పని చేస్తూ భార్యతో కలిసి అక్కడే నివాసముంటున్నాడు. అడవి నుంచి నాటుసారా తయారు చేసి తీసుకువస్తుండగా పోలీసులకు సమాచారం ఇస్తున్నారనే కారణంతో జులై 31వ తేదీన కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తన భర్తను వదిలిపెట్టాలని వేడుకున్న మహిళను పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: ఈ ఘటనపై బాధితురాలు సోమవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులపై 324, 354ఎ, 506, 376డి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను మంగళవారం వెలుగోడు డిగ్రీ కాలేజీ సమీపంలో అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. అత్యాచారం కేసు నమోదులో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెలుగోడు ఎస్సై రాజారెడ్డిని మంగళవారం రాత్రి వీఆర్కు పంపుతూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. Also Read: పోలీస్స్టేషన్కు వచ్చిన బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించడంతో ఆలస్యం చేశారనీ, అత్యాచారం కేసు నమోదు చేస్తే మీ కుటుంబం పరువుపోతుందని వ్యాఖ్యానించినట్లు బాధితురాలు, బంధువులు, భర్త, ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ఎస్సై తీరుకు నిరసనగా ధర్నా, రాస్తారోకో చేపట్టారు. వెలుగోడు ఎస్ఐపై వచ్చిన ఆరోపణలు నిజమని వెలుగోడు డీఎస్పీ వెంకట్రావు నిర్ధారించడంతో ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. Also Read:
By August 05, 2020 at 09:44AM
No comments