హైదరాబాద్: ఫేస్బుక్ ప్రియురాలితో సహజీవనం.. మరొకరితో పెళ్లి
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ యువతిని ప్రేమించి ఆమెతో కొన్నాళ్లు చేశాక మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న మోసగాడి ఉదంతమిది. బాధితురాలి ఫిర్యాదుతో శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు నిందితుడిపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధి బహదూర్గూడకు చెందిన రాజ్కుమార్(25) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం హైదరాబాద్కు చెందిన ఓ యువతి(20)తో ఫేస్బుక్లో పరిచయం జరిగింది. Also Read: రోజూ ఆమెతో ఛాటింగ్ చేస్తూ కొద్దిరోజులకు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. రాజ్కుమార్ మాటలు నమ్మిన యువతి ఇంటి నుంచి వచ్చేసి నాలుగు నెలలు అతడితో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఆమె ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా మాట దాటవేసేవాడు. ఆమెపై మోజు తీరాక గుట్టుగా మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడు. Also Read: ఇటీవల రాజ్కుమార్ తన నుంచి తప్పించుకుని తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన బాధితురాలు నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆమె ఆరా తీయగా మరొకరిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. ఇంత మోసం చేస్తావా? అంటూ ఆమె ప్రశ్నించగా... నీపై మోజు తీరిపోయింది. అందుకే వేరొకరిని పెళ్లి చేసుకున్నానంటూ సమాధానం చెప్పాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు రాజ్కుమార్పై కేసు నమోదు చేశారు. Also Read:
By August 03, 2020 at 07:16AM
No comments