Breaking News

పంజాబ్: విద్యార్థులకు జన్మాష్టమి కానుక.. నేటి నుంచి ఫ్రీగా స్మార్ట్ ఫోన్‌లు పంపిణీ


కోవిడ్ కారణంగా మూతబడిన విద్యా సంస్థలు ఇప్పట్లో పునఃప్రారంభం సాధ్యం కాకపోవడంతో డిజిటల్ తరగతుల నిర్వహణకు ప్రభుత్వాలు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే, స్మార్ట్ ఫోన్‌లు లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల వ్యతలను గుర్తించిన .. యువతకు మొబైల్ ఫోన్‌లు అందజేయనుంది. ఆగస్టు 12 నుంచి రాష్ట్రంలోని యువతకు సెల్‌ఫోన్లు అందించనున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ‘కరోనా వైరస్ విపత్కర కాలంలో ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కాలేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించబోతున్న సెల్‌ఫోన్లు వారికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి’ అని ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వం అందజేసే మొబైల్ ఫోన్‌ల ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో సులువుగా పొందవచ్చని తెలిపింది. పాఠశాల విద్యాశాఖ పోస్టు చేసిన సమాచారాన్ని సైతం సెల్‌ఫోన్ల ద్వారా సులభంగా పొందవచ్చు అని పేర్కొంది. తొలి విడతలో 1.75 లక్షల మందికి మొబైల్‌ ఫోన్లను పంజాబ్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ దశలో జిల్లా కేంద్రాలు, పెద్ద పట్టణాల్లో అందజేయనున్నారు. పంజాబ్, చండీగఢ్‌లలోని 26 కేంద్రాల్లో ఈ పంపిణీ జరగనుంది. ఏదైనా జిల్లా లేదా పట్టణంలో 15 మందికి మించని విద్యార్థులను ఆహ్వానించనున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న బాలబాలికలకు స్మార్ట్ ఫోన్‌లు అందజేయనున్నట్టు వెల్లడించింది. కృష్ణాష్టమి రోజున విద్యార్థులకు ఈ కానుక అందజేస్తున్నారు. ఇదే రోజు అంతర్జాతీయ యువజన దినోత్సవం కావడంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2017లో అధికారంలోకి వచ్చేముందు రాష్ట్రంలోని యువతకు సెల్‌ఫోన్లు అందిస్తామని కాంగ్రెస్‌ హామీఇచ్చింది.


By August 12, 2020 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/punjab-congress-govt-to-distribute-free-smartphones-to-students-on-august-12/articleshow/77497401.cms

No comments