Breaking News

ప్రాణం తీసిన భూవివాదం.. తమ్ముడి చేతిలో కాంగ్రెస్‌ నేత దారుణ హత్య


భూ వివాదాలు ఓ కాంగ్రెస్ నేత ప్రాణాన్ని బలిగొన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఎలగలబోయిన వెంకన్న తన తమ్ముడి చేతిలోనే దారుణహత్యకు గురయ్యారు. భూతగాదా విషయంలో ఆయన తమ్ముడు, తమ్ముడి కొడుకులే ప్లాన్ ప్రకారం వెంకన్నను హతమార్చినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. Also Read: మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం(వి)కేసముద్రం(వి) గ్రామానికి చెందిన ఎలగలబోయిన వెంకన్న(52), ఆయన సోదరుడు ఎలగలబోయిన చంద్రయ్య మధ్య ఐదేళ్లుగా భూవివాదం కొనసాగుతోంది. 12 గుంటల భూమి పంపకంపై ఇటీవల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేసుకునేందుకు ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీనికోసం ఒక్కొకక్కరు రూ.5వేల చొప్పున డిపాజిట్ కట్టారు. అన్నదమ్ములిద్దరూ పట్టు వీడకపోవడంతో పంచాయతీలో పరిష్కారం లభించలేదు. దీంతో పెద్ద మనుషులు వారు కట్టిన డబ్బులు తిరిగిచ్చేశారు. Also Read: ఈ క్రమంలోనే చంద్రయ్య, ఆయన కుమారులు రాజశేఖర్‌, శ్రావణ్‌ కలిసి కలిసి వెంకన్నను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. శనివారం పత్తిపంటకు నీరు పెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వచ్చిన వెంకన్నతో వారు గొడవపడ్డారు. పారతో వెంకన్న తలపై కొట్టడంతో అతడు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో చంద్రయ్య, ఆయన కుమారులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న వెంకన్న కుమారుడు అనిల్‌ , ఇతర రైతులు ఆయన్ని చికిత్స నిమిత్తం 108లో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రయ్య, రాజశేఖర్‌, శ్రావణ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By August 09, 2020 at 08:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-congress-party-leader-brutally-murdered-by-brother-in-mahabubabad-district/articleshow/77441218.cms

No comments