Breaking News

కర్ణాటక సీఎం కూతురుకు కరోనా పాజిటివ్...


కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప కరోనా బారిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కూతురుకు కూడా కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. కరోనా సోకిన సీఎం కుమార్తెను ఆదివారం రాత్రి బెంగళూరు నగరంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యెడియూరప్పకు కరోనా సోకడంతో గత రెండు వారాలుగా హోంక్వారంటైన్ లో ఉన్నారు. దీంతో సీఎం అధికారిక నివాసంలోని ఉద్యోగులతోపాటు సీఎం కుమార్తెకు కరోనా పాజిటివ్ అని తేలింది. నిన్న రాత్రి కరోనాతో బెంగళూరులోని మణిపాల్ దవాఖానలో చేరారు. తాను బాగానే ఉన్నానని ట్వీట్ చేశారు. సీఎం కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయన కూతురుకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె దవాఖానలో చేరినట్లు మణిపాల్ హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. గత నెల మొదటివారంలో సీఎం అధికార నివాసంలోని ఆఫీస్‌లో పనిచేస్తున్న వ్యక్తికి కూడా కరోనా సోకింది. నిన్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన గురుగ్రామ్‌లోని వేదాంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. శనివారం అమిత్‌షాను కలిసిన మంత్రి బాబూల్ సుప్రియో తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ కూడా కరోనాబారినపడ్డారు. ఆదివారం ఆయన చెన్నైలోని కావేరీ దవాఖానలో పరీక్షలు చేయింకున్నారు. అందులో ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో తన నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు.


By August 03, 2020 at 09:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/karnataka-cm-b-s-yediyurappa-daughter-test-positive-for-coronavirus/articleshow/77325025.cms

No comments