Breaking News

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి వివాహిత గ్యాంగ్ రేప్.. 2 నెలల తర్వాత వెలుగులోకి


జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కామాంధులు అర్ధరాత్రి వేళ వివాహితపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తామని నిందితులు బెదిరించడంతో బాధితురాలు రెండు నెలల పాటు ఎవరికీ చెప్పలేదు. చివరికి తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన ఓ మహి తన భర్త పిల్లలతో కాపురం ఉంటోంది. గతంలో వారు ఇల్లు కట్టుకున్న సమయంలో తాపీ మేస్త్రీలుగా పని చేసిన చేశెట్టి బాలాజీ, మంతెన లచ్చ, తీడ లోవరాజు ఆమెపై కన్నేశారు. తమ కోరిక తీర్చాలంటూ తరుచూ వేధించేవారు. ఇటీవల ఆమె మామ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో భర్త అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ముగ్గురు అర్థరాత్రి వేళ ఒంటరిగా ఉన్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది. రెండు నెలల పాటు తనలో తానే కుమిలిపోయి చివరికి తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పి భోరుమంది. వారి సహకారంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాకినాడ డీఎస్పీ భీమారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By August 05, 2020 at 09:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-gang-raped-by-3-men-in-east-godavari-district/articleshow/77363955.cms

No comments