Breaking News

Green India Challenge: ఈ పనితో ప్రకృతికి మేలు చేసిన వాళ్ళమవుతాం.. స్మిత, నానిలకు అల్లరి నరేష్ సవాల్


రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగమవుతున్నారు. పలువురు నటీనటులు, దర్శకనిర్మాతలు ఎవరికి వారు పెద్దఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ భావితరాలకు మెరుగైన వాతావరణం ప్రసాదించడంలో అంతా భాగం కావాలని పిలుపునిస్తున్నారు. Also Read: ఈ కార్యక్రమంలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు విసిరిన సవాల్ స్వీకరించి ఫిలింనగర్ లోని తన ఆఫీస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు హీరో . అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతికి మేలు చేసిన వాళ్ళమవుతామని చెప్పారు. హీరో , సింగర్ , డైరెక్టర్ దేవా కట్ట ముగ్గురికీ సవాల్ విసురుతున్నట్లు పేర్కొన్నారు అల్లరి నరేష్. 2002 సంవత్సరం 'అల్లరి' సినిమాతో తన వెండితెర ప్రయాణం మొదలుపెట్టిన నరేష్.. కామెడీ చిత్రాలకు పెట్టింది పేరు అన్నట్లుగా కీర్తి గడించారు. ఇటీవలే మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో ఓ విలక్షణ పాత్రలో నటించిన అల్లరి నరేష్.. ప్రస్తుతం ‘నాంది’ అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


By July 26, 2020 at 07:59AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allari-naresh-participated-in-green-india-challenge/articleshow/77177097.cms

No comments