Breaking News

నిజామాబాద్: కరోనా ఆస్పత్రిలో ఉరేసుకున్న అత్యాచార నిందితుడు


అత్యాచార కేసులో అరెస్టయి జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న నిందితుడు ఆసుపత్రిలోని కరోనా వార్డు బాత్‌రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో జరిగింది. నిర్మల్‌ పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన బాలాజీ రాజు పవార్‌ (24) అనే యువకుడు బాన్సువాడకు చెందిన వరసకు చెల్లెలు అయ్యే బాలిక(13)పై కన్నేశాడు. ఫిబ్రవరి 10న ఆమెను బలవంతంగా పుణె తీసుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు రోజుల తర్వాత బాలికను రక్షించి నిందితుడిని అరెస్ట్ చేశారు. Also Read: బాలాజీ రాజు పవార్‌ తనను పుణె తీసుకెళ్లి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని బాలిక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు పవార్‌పై కిడ్నాప్, రేప్ కేసులతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న అతడికి మూడు రోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించగా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కోర్టు ఆదేశాలతో అతడిని నిజామాబాద్ జనరల్ హాస్పిటల్‌లోని కరోనా వార్డులో చేర్పించారు. Also Read: బుధవారం అతడికి మరోసారి టెస్టులు చేయగా కరోనా లక్షణాలు కనిపించలేదు. దీంతో అతడిని గురువారం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, అనంతరం జైలుకు తరలించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే పవార్‌ బుధవారం రాత్రి హాస్పిటల్ బాత్రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేపట్టారు. Also Read:


By July 17, 2020 at 09:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rape-accused-commits-suicide-in-nizamabad-general-hospital/articleshow/77011511.cms

No comments