Breaking News

కేరళ గోల్డ్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్... హైదరాబాద్ హవాలా రాకెట్‌తో లింకులు?


దేశాన్నే కుదిపేసిన గోల్డ్ స్కామ్‌ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన స్వప్నా సురేశ్‌, సందీప్‌ నాయర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారానికి హైదరాబాద్‌తో లింకులు ఉన్నట్లు కస్టమ్స్‌ విభాగం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నగదు చెల్లింపులన్నీ హైదరాబాద్ నుంచే జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో చెల్లింపులన్నీ హవాలా రూపంలోనే జరుగుతాయని, అందువల్ల దీని వెను హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తుల హస్తం కచ్చితంగా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Also Read: ఈ నెల 6వ తేదీన దుబాయ్‌ నుంచి చార్టర్డ్‌ విమానంలో వచ్చిన కన్‌సైన్‌మెంట్‌ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య మార్గంలో తరలిన రూ. 15 కోట్ల విలువైన బంగారం విమానాశ్రయంలో పట్టుబడటంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేసి విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. Also Read: కేరళ ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పరిధిలోని స్పేస్‌ పార్క్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న స్వప్న సురేష్ దీనికి ప్రధాన సూత్రధారి అని తేలడంతో ఎన్ఐఏ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏకంగా సీఎం కార్యాలయం ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐటీ సెక్రటరీ ఎం.శివశంకర్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తూ వెంటనే ఆదేశాలు జారీచేసింది. Also Read:


By July 19, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kerala-gold-smuggling-case-updates-nia-identifieds-hyderabad-hawala-racket-links/articleshow/77047033.cms

No comments