భార్య చేయి పట్టుకున్నాడని హత్య.. విజయనగరంలో దారుణం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/77046167/photo-77046167.jpg)
తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడన్న కోపంతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేసిన ఘటన జిల్లా మెంటాడ మండలం ఆండ్ర గ్రామంలో చోటుచేసుకుంది. ఆండ్ర గ్రామానికి చెందిన సప్పాల పైడితల్లి వద్ద మిర్తివలసకు చెందిన పొయిరి రామచంద్ర కొద్దిరోజుల క్రితం ఆవును కొనుగోలు చేశాడు. అయితే ఆవు మధ్యలోనే తిరిగి పాత యజమాని దగ్గరకు వచ్చేసింది. దాన్ని తీసుకెళ్లేందుకు రామచంద్ర ఎంత ప్రయత్నించినా అతడి వల్ల కాలేదు. దీంతో ఆవును తన ఇంటికి తీసుకొచ్చే బాధ్యతకు అతడు పైడితల్లికే అప్పగించాడు. Also Read: దీంతో పైడితల్లి ఈ నెల 10వ తేదీన కన్నయ్య, సిపాయి అనే సహాయకులతో కలిసి మిర్తివలసకు ఆవును తీసుకెళ్లి రామచంద్రకు అప్పగించాడు. మిగిలిన ఇద్దరు వ్యక్తులు అదేరోజు ఆండ్రకు తిరిగి వెళ్లిపోగా పైడితల్లి అక్కడే ఉండిపోయాడు. రాత్రివేళ కల్లు తాగిన మత్తులో రామచంద్ర భార్యపై కన్నేసిన పైడితల్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. కోరిక తీర్చాలంటూ ఆమె చేయి పట్టుకుని ఇంట్లోని లాక్కేందుకు ప్రయత్నించాడు. Also Read: ఆమె ఈ విషయాన్ని భర్త రామచంద్రకు చెప్పడంతో అతడు ఆవేశంతో రగిలిపోయాడు. కర్రతో పైడితల్లిని విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు. శనివారం రామచంద్ర ఇంటి సమీపంలోనే పైడితల్లి మృతదేహాన్ని గమినించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే రామచంద్ర కూనేరు వీఆర్వో దగ్గర లొంగిపోయాడు. వీఆర్వో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. Also Read:
By July 19, 2020 at 09:14AM
No comments