హైదరాబాద్లో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు... బెంగాలీ యువతులకు విముక్తి
నగరంలో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఆన్లైన్ వ్యభిచార దందాను రాచకొండ పోలీసులు చేధించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు వంశీ రెడ్డి అలియాస్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి నలుగురు యువతులకు విముక్తి కలిగించారు. వీరిలో ముగ్గురు పశ్చిమ బెంగాల్కు చెందినవారు కాగా... మరొకరిది విజయవాడ అని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిర్వాహకురాలు అంజలి, ఆమె సహాయకుడు చిన్నా కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read: గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వంశీరెడ్డి, విజయవాడకు చెందిన అంజలి, చిన్నా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరికి వివిధ రాష్ట్రాల్లో యువతులను సరఫరా చేసే బ్రోకర్లతో సంబంధాలున్నాయి. వారికి కొంత డబ్బు చెల్లించి కోల్కతా నుంచి ముగ్గురు, విజయవాడ నుంచి ఓ యువతిని హైదరాబాద్కు రప్పించారు. బల్కంపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. యువతుల అర్ధ నగ్న ఫోటోలను సోషల్మీడియాతో పాటు, లొకాంటో లాంటి వెబ్సైట్లలో ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు. విటుల నుంచి ఫోన్ రాగానే నిర్వాహకులు అప్రమత్తమవుతారు. ఆ ఫోన్ నంబరు ఎలా తెలిసిందంటూ ఆరా తీసి కాల్ కట్ చేస్తారు. Also Read: ఫోన్కాల్ వచ్చిన నంబరును ట్రూకాలర్, ఫేస్బుక్ ద్వారా పరిశీలించి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుసుకున్న తర్వాత ఆ నంబర్కు కాల్ చేసి గూగుల్ పే ద్వారా అడ్వాన్స్ కట్టించుకుంటారు. మరుసటి రోజు విటులు కోరుకున్న సమయంలో వారు చెప్పిన ప్రాంతానికి అమ్మాయిలను తీసుకెళ్తారు. ఈ సెక్స్ దందాపై పక్కా సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు మల్కాజిగిరి ఎస్వోటీ సీఐ నవీన్కుమార్, కీసర సీఐ నరేందర్ ఆధ్వర్యంలో డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. విటుల్లా వారికి ఫోన్ చేసి సహ నిర్వాహకుడైన వంశీరెడ్డిని మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లికి రప్పించి అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అంజలి, చిన్నా పరారయ్యారు. వీరి బారి నుంచి నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులను రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించారు. Also Read:
By July 30, 2020 at 08:07AM
No comments