Breaking News

డ్రైవర్‌ను చంపేసి కారు ఎత్తుకెళ్లేందుకు యత్నం.. గుంటూరు జిల్లాలో దారుణం


నగరానికి చెందిన కారు డ్రైవర్ కోలా వెంకటేష్(28) జిల్లా కారంపూడిలో దారుణ హత్యకు గురయ్యాడు. తాటిచెట్లపాలెం రామచంద్రనగర్‌ ప్రాంతానికి చెందిన కోలా వెంకటేష్‌(28) జీవనోపాధి కోసం లాక్‌డౌన్‌కి ముందు కారు కొని నడుపుకుంటున్నాడు. గురువారం ఉదయం గుంటూరు జిల్లాకి చెందిన అలేఖ్‌ అనే వ్యక్తి అతడిని శ్రీశైలం వెళ్లడానికి కిరాయికి మాట్లాడుకుని బయల్దేరారు. గుంటూరు జిల్లా కారంపూడి సమీపంలోకి వెళ్లేసరికి పొద్దుపోయింది. దీంతో రాత్రికి అక్కడే పడుకుని ఉదయం బయలుదేరదామని అలేఖ్ చెప్పాడు. దీంతో వెంకటేష్ కారు రోడ్డు పక్కనే నిలిపాడు. Also Read: అలేఖ్ వెంట తెచ్చుకున్న మద్యాన్ని వెంకటేష్‌తో కలిసి తాగాడు. ప్లాన్ ప్రకారం అందులో సైనేడ్ కలిపి డ్రైవర్‌తో తాగించాడు. ఆ మద్యాన్ని తాగిన వెంకటేష్ కాసేపటికే కారులోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని ఎక్కడైనా పడేసి కారును తీసుకొని పరారవ్వాలని అనుకుంటున్న సమయంలో పెట్రోలింగ్ పోలీసులు గమనించి ఆగారు. డ్రైవర్‌ మద్యం తాగి పడుకున్నాడని, నిద్రలేచిన తర్వాత శ్రీశైలం వెళ్తామని అలేఖ్‌ చెప్పడంతో వారు వెళ్లిపోయారు. అయితే జీప్‌లోని ఓ అధికారి వెనక్కి తిరిగి చూడగా కారు నంబర్ ప్లేట్ కనిపించలేదు. అనమానంతో వారు వెనక్కి వచ్చి ప్రశ్నించగా దారిలో ఎక్కడో పడిపోయిందని చెప్పాడు. Also Read: దీంతో పెట్రోలింగ్ పోలీసులు డ్రైవర్‌‌ లేపమని గద్దించడంతో అలేఖ్‌ పరారవ్వడానికి ప్రయత్నించాడు. అతన్ని పట్టుకొని విచారించగా తానే డ్రైవర్‌ను హత్య చేసినట్లు తెలిపాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన కారు డ్రైవర్‌ వెంకటేష్‌ కుటుంబసభ్యులు, కాలనీ నాయకులు శనివారం రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముతంశెట్టి శ్రీనివాసరావును కలిశారు. తమకు న్యాయం చేయాలని, మృతదేహాన్ని త్వరగా నగరానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. Also Read:


By July 05, 2020 at 07:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-arrested-bypolive-over-killed-car-driver-in-guntur-district/articleshow/76792747.cms

No comments