Breaking News

అత్యంత చవకగా కరోనా టెస్టింగ్ కిట్.. ధర ఎంతంటే?


కరోనా భయంతో వణుకుతున్న జనానికి ఓ గుడ్ న్యూస వచ్చింది. ఏ మాత్రం అనారోగ్యానికి గురైన తమకు ఎక్కడ కరోనా వచ్చిందేమోనని జనం భయపడిపోతున్నారు. కొందరికైతే.. కరోనా లక్షణాలు ఉన్నా కూడా ఎక్కడ టెస్టులు చేసుకోవాలో కూడా సరిగా తెలియని పరిస్థితి. ప్రైవేటు ల్యాబులకు వెళ్తే.. టెస్టులకే వేలాదిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో మన ఇంటి దగ్గర మనమే కరోనా టెస్టు చేసుకునే కిట్ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ కిట్ ధర కూడా చాలా తక్కువ. ఢిల్లీ ఐఐటీ అత్యంత చవకైన కొవిడ్ టెస్టింగ్ కిట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని అసలు ధర రూ. 399 కాగా, ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్, శాంపిల్ కలెక్షన్ వంటి వాటితో కలుపుకుని రూ. 700లోపు లభ్యమవుతుంది. కోరోష్యూర్ పేరుతో ఢిల్లీ ఐఐటీకి చెందిన 9 మంది రీసెర్చ్ విద్యార్థులు దీనిని అభివృద్ధి చేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, సహాయమంత్రి సంజయ్ ధోత్రే, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే, ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ వి.రామ్‌గోపాలరావు కలిసి ఈ కరోనా టెస్టింగ్ కిట్‌ను విడుదల చేశారు. ఈ కిట్‌కు ఐసీఎంఆర్ ఆమోదం కూడా ఇచ్చింది. న్యూటెక్ మెడికల్ డివైజెస్ సంస్థతో కలిసి దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. Read More: ఈ కిట్‌లో వాడిన అన్ని రకాల పరికరాలు దేశీయంగా తయారైనవేనని ఐఐటీ డైరెక్టర్ రామ్‌గోపాలరావు తెలిపారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే పలు పరిశోధనలు చేపట్టామని, అశ్వగంధ ఔషధం వైరస్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించినట్టు ఆయన వివరించారు. కరోష్యూర్ కిట్ ఆవిష్కరించిన అనంతరం మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ మాట్లాడుతూ.. మేక్‌ ఇన్‌ ఇండియాలో ఇది ఒక గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ కరోనా కిట్‌ అత్యధిక స్కోరుతో ఐసీఎంఆర్ అనుమతి పొందిందని, కచ్చితత్వంగా కూడిన ఫలితాలు వస్తాయంటూ డీసీజీఐ కూడా కరోనా కిట్ కు ఆమోదం తెలిపిందన్నారు.


By July 16, 2020 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/iit-delhi-launches-corosure-test-kit-for-covid-19/articleshow/76992710.cms

No comments