Breaking News

బీరు సీసాలతో కొట్టుకున్న స్నేహితులు.. తల పగిలి యువకుడి మృతి


మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లా కావలిలో జరిగింది. పట్టణంలోని అరుంధతిపాలెంకు చెందిన ప్రవీన్‌కుమార్, సౌమిత్, జశ్వంత్, బబ్బు అనే యువకులంతా కలిసి ఆదివారం రాత్రి ముసునూరు ప్రాంతంలో మద్యం సేవించారు. అందరూ మత్తులో ఉండగా ఓ విషయంపై వాగ్వాదం మొదలై అదికాస్తా ఘర్షణకు దారితీసింది. యువకులంతా మద్యం సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. Also Read: ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్(20) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో సౌమిత్ అతడిని బైక్‌పై ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. డాక్టర్లు అతడిని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై హాస్పిటల్‌లో ఓపీ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేష్‌కుమార్ కావలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ అరుణకుమారి వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సౌమిత్‌తో పాటు మిగిలిన యువకులను విచారించి ఆధారాలు సేకరించారు. సీఐ అక్కేశ్వరరావు ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By July 06, 2020 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-died-over-friends-beating-with-beer-bottles-in-nellore-district/articleshow/76808087.cms

No comments