Breaking News

హైదరాబాద్‌లో 4నెలల పాప కిడ్నాప్.. 14 గంటల్లోనే తల్లి ఒడికి


నగరంలో 4 నెలల పసికందు కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే సకాలంలో స్పందించిన మంగళ్‌హాట్‌ పోలీసులు 14 గంటల్లోనే బిడ్డను రక్షించి తల్లికి అప్పగించారు. సీతారాంబాగ్‌ ప్రాంతానికి చెందిన లక్ష్మి(30)కి నాలుగు నెలల వయసున్న రేణుక అనే పాప ఉంది. భర్త వృత్తి రీత్యా వేరే ప్రాంతంలో ఉంటుండటంతో తండ్రి శాంతయ్య వద్ద బిడ్డతో కలిసి ఉంటోంది. Also Read: శనివారం తెల్లవారుజామున పాప కనిపించకపోవడంతో లక్ష్మి మంగళ్‌హాట్‌ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే స్పందించిన పోలీసులు సమీప ప్రాంతంలోని 30 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను సేకరించారు. ఆటోలో చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించడంతో అది ఎటువైపు వెళ్లిందో తెలుసుకున్నారు. అల్లాబండాలోని ఓ ఇంట్లో పాపను ఉంచినట్లు తెలుసుకుని దాడి చేశారు. Also Read: నిందితులైన ఆటోడ్రైవర్ షేక్‌ అలీమ్‌(39), అశ్రియా(36), షేక్‌ సలీం(40)లను అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. కేవలం 14 గంటల్లోనే కిడ్నాప్‌ను చేధించిన పోలీసులు బిడ్డను కన్నతల్లికి అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే చాకచక్యంగా స్పందించి పాపను రక్షించిన మంగళ్‌హాట్‌ పోలీసులను సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ అభినందించారు. Also Read:


By July 13, 2020 at 08:53AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/4-months-baby-girl-kidnapped-in-hyderabad-accused-arrested/articleshow/76932035.cms

No comments