Breaking News

మంచిర్యాల: ఆన్‌లైన్‌ గేమ్‌లో రూ.15లక్షలు కోల్పోయి యువకుడి ఆత్మహత్య


ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన ఓ యువకుడు నిత్యం అందులోనే తలమునకలై రూ.15 కోల్పోయాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నానన్న బాధతో పాటు, తల్లిదండ్రులను అప్పుల పాటు చేశానన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన జిల్లా లక్షెట్టిపేటలో విషాదం నింపింది. లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెలకు చెందిన తోట మధూకర్(24) హైదరాబాద్‌‌లో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. Also Read: కొంతకాలంగా ‘డఫ్పా బెట్‌’ అనే ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతూ దానికి బానిసగా మారాడు. దీంతో తన వద్దనున్న డబ్బుతో పాటు ఫ్రెండ్స్, బంధువుల వద్ద సుమారు రూ.15 లక్షల వరకు అప్పులు చేసి గేమ్‌లో కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి అన్ని అప్పులు తీర్చేశాడు. అయితే తన తీరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడిందని మధూకర్ తీవ్రంగా బాధపడేవాడు. ఈ నెల 7న ఉదయం ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు తీసుకురావాలని తండ్రి చెప్పడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మధూకర్ తిరిగి రాలేదు. Also Read: అదే రోజు మధ్యాహ్నం సమయంలో దండేపల్లి మండలం చింతపల్లి గ్రామంలో ఉండే తన అక్క మౌనికకు తాను మంచిర్యాలలో పురుగుల మందు తాగినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ చేశాడు. మౌనిక వెంటనే తన తండ్రికి సమాచారం ఇవ్వడంతో మంచిర్యాల వెళ్లాడు. మధూకర్‌ను ఆచూకీ కనిపెట్టి వెంటనే కరీంనగర్‌లోని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధూకర్ శనివారం సాయంత్రం చనిపోయాడు. తండ్రి శంకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By July 12, 2020 at 10:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/engineering-student-commits-suicide-mancherial-district-over-he-losts-rs-15-lakhs-for-online-games/articleshow/76918379.cms

No comments