14ఏళ్లకే కామంతో రగిలిపోయి బాలికపై అత్యాచారం.. కాకినాడలో దారుణం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/76918791/photo-76918791.jpg)
ఎనిమిదేళ్ల చిన్నారిపై ఓ బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లా సర్పవరం పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. కాకినాడ గ్రామీణ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఓ కుమార్తె(8) ఉంది. ఈ నెల ఏడో తేదీన తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఇంటి పక్కనుండే బాలుడు(14) ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లికి బాధితురాలు జరిగినదంతా చెప్పడంతో ఆమె గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. Also Read: అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా గ్రామ పెద్దలు ఇరువర్గాల మధ్య సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బాలిక తల్లి ఈ నెల పదో తేదీన కాకినాడలోని దిశ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దిశ పీఎస్ ఇన్ఛార్జ్, పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఆదేశాలతో సర్పవరం పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:
By July 12, 2020 at 11:24AM
No comments