Breaking News

రాజమండ్రిలో గ్యాంగ్ రేప్: ప్రధాన సూత్రధారి బాలిక అక్కే.. 12 మంది అరెస్ట్


రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కోరుకొండ మండలానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలికపై అఘాయిత్యం వెనుక ఆమెకు అక్క వరసయ్యే మచ్చా అనిత అనే మహిళే ప్రధాన కుట్రదారని రాజమహేందవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌ తెలిపారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు. ఈ కేసు వివరాలను సోమవారం ఆయన మీడియాకు వెల్లడించారు. Also Read: కోరుకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అనిత అనిత రాజమహేంద్రవరంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. తనకు చెల్లెలి వరుసయ్యే బాలిక(బాధితురాలు)కు మరో షాపులో పని ఇప్పించింది. బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న అనిత జూన్ 22న ఆమెను వెంటబెట్టుకుని ఎయిర్‌పోర్టు రోడ్డుకు వెళ్లింది. అక్కడ ఐదుగురు యువకులు బాలికను ఆటోలో ఎక్కించుకుని రంపచోడవరం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని అనిత సహా నిందితులు బెదిరించడంతో బాలికను ఇంటి దగ్గర వదిలిపెట్టారు. Also Read: దీన్ని ఆసరాగా తీసుకుని అనిత తనకు పరిచయమున్న మరికొంతమంది కుర్రాళ్లతో ఆమెను ఆటోలో కిడ్నాప్ చేసి మరోసారి సామూహిక అత్యాచారం చేయించింది. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై కొద్దిరోజులు బయటకు రాలేదు. ఈ నెల 12న అనిత బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించి ఆటోలో క్వారీ ప్రాంతంలోని ఒక ఖాళీ పెంకుటింటికి తీసుకువెళ్లింది. అక్కడ మరి కొంతమంది యువకులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 13వ తేదీ సాయంత్రం బాధితురాలిని అక్కడి నుంచి తరలించి గోకవరం బస్టాండు సమీపంలోని ఓ ఆసుపత్రి సమీపంలో ఉంటున్న లావణ్య అనే మహిళ ఇంట్లో బంధించారు. Also Read: మూడు రోజులు గడిచినా బాలిక తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి 15వ తేదీన కోరుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న నిందితులు బాలికను ఇంటికి సమీపంలో వదిలిపెట్టారు. ఆ వెంటనే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తల్లి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాలిక నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కిడ్నాప్, రేప్ కేసులతో పాటు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనిత, లావణ్యతో పాటు మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read: నిందితుల్లో నలుగురు ఆటోడ్రైవర్లు, వివిధ పనులు చేసుకుంటున్నవారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. వీరిలో డానీ అనే వ్యక్తితో గతంలో రాజానగరంలో కిడ్నాప్ కేసు నమోదై ఉంది. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత కరోనా టెస్టులు చేయించారు. ఈ సందర్భంగా ఇద్దరికి పాజిటివ్ రావడంతో అంతా షాకయ్యారు. Also Read:


By July 21, 2020 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/12-accused-arrested-in-rajahmundry-girl-gang-rape-case/articleshow/77076865.cms

No comments