హైదరాబాద్లో వృద్ధురాలి దారుణహత్య.. నగలతో ఉడాయించిన పనిమనిషి

ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని దారుణంగా హత్యచేసి బంగారు ఆభరణాలతో పనిమనిషి పరారైన ఘటన హైదరాబాద్లోని కాచిగూడలో కలకలం రేపింది. ఆర్అండ్బీ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ లక్ష్మీనారాయణకు భార్య కమలమ్మ(85), ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. లక్ష్మీనారాయణ 15ఏళ్ల క్రితమే చనిపోయారు. పిల్లలకు వివాహాలు కావడంతో నగరంలోనే వేర్వేరు చోట్ల ఉంటున్నారు. కమలమ్మ మాత్రం కాచిగూడ పీఎస్ పరిధిలోని చెప్పల్ బజార్లో ఒంటరిగా ఉంటోంది. వయసు రీత్యా శరీరం సహకరించకపోవడంతో అన్ని పనులకు పనిమనిషిపైనే ఆధారపడుతోంది. చాలాకాలంగా నమ్మకంగా పనిచేస్తున్న ఆ మహిళ పెన్షన్ డబ్బుల కోసమని ఊరికి వెళ్లింది. Also Read: దీంతో మూడు రోజుల క్రితం విజయనగరానికి చెందిన లక్ష్మి(38)ని ఉప్పల్లోని ఓ ఏజెన్సీ వారు కమలమ్మ ఇంటికి పనిమనిషిగా పంపారు. శనివారం ఉదయం 7 గంటలకు ఇంట్లో అద్దెకు ఉండే సునీత వచ్చి చూడగా కమలమ్మ మంచంపై విగతజీవిగా పడి ఉంది. దీంతో కంగారుపడిన సునీత ఈ విషయాన్ని ఆమె కుమారుడు సురేశ్కు సమాచారమిచ్చింది. దీంతో ఆయన వెంటనే కాచిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాచిగూడ ఏసీపీ సుధాకర్, క్లూస్టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఎదురింట్లో సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి కొత్తగా చేరిన పనిమనిషి లక్ష్మియే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించారు. బీరువాలోని బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వాటి కోసమే కమలమ్మను చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. Also Read: పనిమనిషి లక్ష్మి.. కమలమ్మను దిండుతో ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. హతురాలి మెడలోని బంగారు గొలుసు, గాజులతో పాటు రూ.5 వేల నగదు చోరీ చేసి ఉడాయించినట్లు అంచనాకు వచ్చారు. దొంగిలించిన సొమ్ముతో పారిపోయే క్రమంలో లక్ష్మి ఆటోలో కమలమ్మ బ్యాంక్ పాస్బుక్ మరిచిపోయింది. దీన్ని డ్రైవర్ పోలీసులకు అందజేశాడు. ఆమె ఆటో ఎక్కడ ఎక్కింది, ఎక్కడ దిగింది అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. Also Read:
By June 21, 2020 at 08:15AM
No comments