Breaking News

‘ఇంట్లో యోగా, కుటుంబంతో యోగా’.. ప్రధాని మోదీ యోగ దినోత్సవం నినాదం


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇంట్లో యోగా ద్వారా కుటుంబం మధ్య మరింత బంధాన్ని పెంపొందించుకోవచ్చని ప్రధాని అన్నారు. పలు యోగాసనాల వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పెంపొందుతుందన్నారు. కోవిడ్-19 ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థపై దాడిచేస్తుందని, ప్రాణాయామ లేదా బ్రీతింగ్ వ్యాయామాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. అందుకే పలు రకాల ప్రాణాయామాలను ప్రజలు నేర్చుకోవాలని అన్నారు. అంతేకాదు, క్లిష్ట పరిస్థితుల్లోనూ అత్మ విశ్వాసం పెంపొందించడంలో యోగా తోడ్పుతుందన్నారు. యోగా ఆరోగ్యపరంగా మనలోని తపనను పెంచుతుందని పేర్కొన్నారు. ఇది ఐక్యతకు శక్తిగా అవతరించిందని, మనుషులల మద్య బంధాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఒకవేళ, మన ఆరోగ్యం, ఆశయాలను చక్కగా తీర్చిదిద్దగలిగితే, మానవత్వ విజయానికి సాక్ష్యంగా నిలిచే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ప్రపంచం ఎంతో దూరంలో లేదని, యోగా ఖచ్చితంగా ఇది జరగడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఐక్యతకు చిహ్నంగా యోగా ఉద్భవించిందని, దీనికి జాతి, కుల, మత, లింగ వివక్షలేదన్నారు. ‘ఇంట్లో యోగా, కుటుంబంతో యోగా’ మన జీవితంలో ఒక భాగం చేసుకుందాని ప్రధాని పిలుపునిచ్చారు. భారతీయ ఆలోచనా విధానంలోని కర్మయోగ స్ఫూర్తిని బలంగా కొనసాగిద్దామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.


By June 21, 2020 at 07:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/yoga-daypranayam-strengthens-respiratory-system-that-covid-19-attacks-pm-modi-says/articleshow/76488976.cms

No comments