Breaking News

జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... ఉగ్రవాదులు హతం


జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్ జరిగింది. ఉత్తర కశ్మీర్ పరిధిలోని సోపేరీ వద్ద గురువారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సోపేరీ ప్రాంతంలోని హార్డ్ శివ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం అందింది. దీంతో భారత ఆర్మీకి చెందిన 22 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి గాలింపు చేపట్టారు. దీంతో గాలిస్తున్న భారత జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఆర్మీ జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించి ఉంటారని ఆర్మీజవాన్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం జవాన్లు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి చెందారు. జూన్ 23వతేదీన పుల్వామాలోని బండ్ జూ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు, ఓ సీఆర్ పీఎఫ్ జవాన్ మరణించారు. గత 20 రోజులుగా జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలతో ఎదురుకాల్పులు సాగుతూనే ఉన్నాయి. ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో మొబైల్‌ ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశారు.


By June 25, 2020 at 09:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/encounter-breaks-out-between-security-forces-and-terrorists-at-north-kashmirs-sopore/articleshow/76616755.cms

No comments