Breaking News

కరోనా పరీక్షలపై వ్యూహం మార్చిన ఐసీఎంఆర్.. కీలక మార్గదర్శకాలు వెల్లడి


దేశంలో నిర్ధారణ పరీక్షలకు సంబంధించి మార్గదర్శకాలలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) మంగళవారం కీలక మార్పులు చేసింది. దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ కరోనా అనుమానిత లక్షణాలున్నవారికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ప్రయివేట్ హాస్పిటల్స్, కార్యాలయాలు, ప్రభుత్వ రంగ విభాగాల్లోనూ యాంటీబాడీ పరీక్షలను చేపట్టాలని పేర్కొంది. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఎవరికి చేయాలనే దానిపై సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పరిస్థితిని బట్టి ఇప్పటివరకూ ఆరు దశలుగా మార్గదర్శకాలు ఇచ్చిన ఐసీఎంఆర్‌ మంగళవారం మరోసారి సవరించిన గైడ్‌లైన్స్‌ను వెలువరించింది. మే నెలలో వెలువరించిన మార్గదర్శకాల్లో భాగంగా 8 రకాల కేటగిరీల వాళ్లకు విధిగా ఆర్‌టీ–పీసీఆర్‌ (రియల్‌ టైమ్‌ పల్మనరీ చైన్‌ రియాక్షన్‌) పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అన్ని రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను అనుసరించి వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ‘కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్‌ అయిన ఐఎల్‌ఐ లక్షణాలు ఉన్నవారికి. ఆస్పత్రుల్లో పనిచేస్తూ ఐఎల్‌ఐ లక్షణాలున్న వారు, వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో సంబంధం ఉన్నవారు. తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌(సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌)తో బాధపడుతున్నవారు. ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించకపోయినా(అసింప్టమాటిక్‌) హైరిస్క్‌ పాజిటివ్‌ కేసులతో సంబంధం ఉన్నవారు లేదా టెస్టు చేసిన తర్వాత కరోనాగా నిర్ధారణ అయిన వారితో కాంటాక్ట్‌ అయినవారు. æ హాట్‌స్పాట్లు, కంటైన్మెంట్‌ జోన్లలో వైరస్‌ లక్షణాలున్న అందరికీ. ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స పొందుతూ ఐఎల్‌ఐ లక్షణాలు కనిపించిన వారికి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో జ్వరం లేదా జలుబు లక్షణాలున్నా... ఐఎల్‌ఐ లక్షణాలు కనిపించిన వారికి. కరోనా నిర్ధారణ పరీక్ష చేయలేదన్న కారణంతో ప్రసవాలు లాంటి అత్యవసర సేవలను వాయిదా వేయరాదని’ సూచించింది. మే 30న వెలువరించిన మార్గదర్శకాల్లో స్వరాష్ట్రానికి వస్తున్న వలస కార్మికులకు యాంటీబాడీ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. జూన్ 15న ఐసిఎంఆర్ కంటెయిన్‌మెంట్ జోన్లు, హెల్త్‌కేర్ సెట్టింగుల కోసం కొత్త ఆన్-సైట్ డయాగ్నొస్టిక్ కిట్‌ను ఆమోదించింది. ల్యాబొరేటరీ అవసరం లేకుండా వేగంగా, తక్కువ ఖర్చుతో ఫలితాలు వస్తాయి.


By June 25, 2020 at 10:11AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/symptomatic-individuals-anywhere-in-india-are-to-be-tested-for-covid-19-says-icmr/articleshow/76617334.cms

No comments