మతస్వేచ్ఛపై అమెరికా నివేదిక: విదేశీ సంస్థ జోక్యం సహించబోమని స్పష్టంచేసిన భారత్

‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2019’ పేరుతో అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన నివేదిక.. లేదంటూ చేసిన ఆరోపణలపై విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్.. ఇది పక్షపాతంతో కూడిన నివేదికని వ్యాఖ్యానించింది. రాజ్యాంగబద్ధంగా రక్షించబడిన భారత పౌరుల హక్కులపై మాట్లాడటానికి ఒక విదేశీ సంస్థకు ఎటువంటి అర్హతలేదని, ఈ నివేదికలో పక్షపాతం, అవగాహనరాహిత్యం స్పష్టంగా బయటపెట్టిందని పేర్కొంది. భారత్లో మైనారిటీలపై యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్స్ (యుఎస్సీఐఆర్ఎఫ్) నివేదికను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ఈ మేరకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లేఖ రాశారు. యుఎస్సీఐఆర్ఎఫ్ నివేదిక భారతదేశంలో మత స్వేచ్ఛ స్థితిపై పక్షపాతధోరణి, తప్పుదోవ పట్టించేలా ఉందని వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం, స్వచ్ఛంద కార్యకర్తలు, వివిధ మతాల స్వేచ్ఛను గౌరవించడం, సహనం, పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను ఈ నివేదిక నొక్కి చెప్పింది. గత ఆగస్టులో జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా రద్దు, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ఆమోదం తర్వాత చెలరేగిన ఆందోళనలను వివరించింది. చట్టపరమైన అవసరాలలో భాగంగా యుఎస్ కాంగ్రెస్ ఏటా ఈ నివేదికను వెల్లడిస్తుంది. ‘భారత్ శక్తివంతమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలు, అభ్యాసాలు ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తాయి. భారత ప్రజలు, ప్రభుత్వం ప్రజాస్వామ్య సంప్రదాయాలను గర్విస్తున్నాయి’ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. ‘భారత్లో మత స్వేచ్ఛ, చట్ట పాలనకు హామీ ఇచ్చే రాజ్యాంగబద్ధ సంస్థలకు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు.
By June 12, 2020 at 09:34AM
No comments