భర్త స్నేహితుడితో అఫైర్.. అడ్డుగా ఉన్నాడని హత్య.. రెండేళ్ల తర్వాత ట్విస్ట్

స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ నీచుడు.. తన సుఖానికి అడ్డుగా ఉన్నాడని అతడిని దారుణంగా చంపేశాడు. అతడికి ప్రియురాలు కూడా సహకరించింది. రెండేళ్ల తర్వాత సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులకు చిక్కడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని జిల్లాలో జరిగింది. కరీంనగర్ జిల్లా మక్తపల్లికి చెందిన పాలేటి సంపత్(45), స్వరూప దంపతులు. సంపత్కు స్నేహితుడైన పెంట సాగర్ తరుచూ వారి ఇంటికి వస్తూపోయేవాడు. ఈ క్రమంలోనే స్వరూపతో అతడికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సంపత్ పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. దీంతో దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. Also Read: తన అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్తను చంపేయాలని స్వరూప నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. దీంతో సాగర్, తన తమ్ముడు చింత రాముతో కలిసి 2017 నవంబర్ 19న జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న దేవాలయ మెట్ల దారిలో సంపత్పై బీరు సీసాతో దాడి చంపేశారు. దీన్ని హత్యగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎలాంటి క్లూ లభించకపోవడంతో పోలీసులు ఈ కేసు సవాలుగా మారింది. చివరిగా సెల్ఫోన్ సిగ్నల్ ద్వారా దర్యాప్తు చేపట్టి సాగర్ను నిందితుడిగా అతడితో పాటు స్వరూపను కూడా అరెస్ట్ చేశారు. Also Read:
By June 12, 2020 at 10:25AM
No comments