Breaking News

మాజీ సర్పంచ్‌ కుటుంబంపై కిరాయి రౌడీల దాడి.. గుంటూరులో కలకలం


మాజీ సర్పంచ్ కుటుంబంపై రౌడీ మూకలు దాడులకు దిగిన సంఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. మండలం కొప్పుకొండ గ్రామ మాజీ సర్పంచ్ నరసింహారావుపై దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులపైనా దాడికి దిగారు. ఈ దాడుల్లో నరసింహారావు సహా నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడులు చేసింది ఎవరు? ఎందుకు చేశారనే విషయాలు తేలాల్సి ఉంది. కిరాయి రౌడీలు తమపై దాడి చేశారంటూ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కిరాయి మూకలను పంపించి మరీ దాడులు చేయించాల్సిన అవసరమేంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్షలా? లేక వ్యక్తిగత తగాదాలతోనే దాడి జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. Also Read: వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రాజకీయ దాడులు పెరిగిపోయాయనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన రాజకీయంగా జరిగి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


By June 19, 2020 at 12:30PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mob-attack-on-ex-sarpanch-in-vinukonda-of-guntur-district/articleshow/76460637.cms

No comments