Breaking News

AP: లంచం తీసుకున్నాడని.. పంచాయతీ ఈవో డిస్మిస్


ప్రభుత్వ కార్యాలయాల్లో చేతులు తడపనిదే ఫైలు ముందుకు కదలదన్న విషయం అందరికీ తెలిసిందే. తమ పని కోసం తప్పనిసరి పరిస్థితుల్లో దరఖాస్తుదారులు కూడా ఎంతోకొంత ముట్టజెప్పి పనులు చేయించుకోవడం సాధారణంగా జరిగే విషయమే. బహిరంగంగా లంచాలు డిమాండ్ చేస్తున్న ఈ రోజుల్లో లంచావతారులకు షాక్ కొట్టే విషయం వెలుగులోకి వచ్చింది. లంచం తీసుకునే వారి గుండెల్లో భయం కలిగించేలా నిర్ణయం తీసుకుంది. లంచం తీసుకున్నందుకు ఉద్యోగిని ఏకంగా విధుల నుంచి డిస్మిస్ చేసేసింది. విశాఖ జిల్లా కె.కోటపాడు మేజర్ పంచాయతీ పూర్వ ఈవో మేడపాటి సుగుణేశ్వరరావు పట్నాయక్‌ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు రుజువవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కె.కోటపాడుకి చెందిన జి.వెంకటరావు రెండో కొడుకు 2013లో అనారోగ్యంతో మరణించాడు. అతని మరణ ధ్రువీకరణ పత్రం కోసం వెంకటరావు దరఖాస్తు చేసుకున్నాడు. Also Read: ఆ సమయంలో పంచాయతీ ఈవోగా ఉన్న పట్నాయక్‌ డెత్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.20 వేలు డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేనని వెంకటరావు బతిమిలాడడంతో రూ.15 వేలు ఇవ్వాలని చెప్పాడు. లేకుంటే సర్టిఫికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశాడు. కొడుకు చనిపోయి భాధలో ఉంటే డబ్బుల కోసం పీక్కుతింటున్న ఈవో వైఖరిపై ఆగ్రహం చెందిన వెంకటరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ సూచన మేరకు రూ.15 వేలు ఇస్తానని ఇంటికి పిలిచి నగదు ఇచ్చాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న పట్నాయక్‌పై దాడి చేసి పట్టుకుని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో సర్వీసు నిబంధనల మేరకు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఈవో సుగుణేశ్వరరావును ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్శదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. Read Also:


By June 19, 2020 at 12:05PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/panchayat-eo-dismissed-from-services-by-ap-government/articleshow/76460084.cms

No comments