ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి.. అవమానం తట్టుకోలేక ఇద్దరు కొడుకుల ఆత్మహత్య

అక్రమ సంబంధం ఇద్దరు యువకులు నిండు ప్రాణాలను బలిగొంది. భర్తకు దూరంగా ఉంటున్న మహిళ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతడితో వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇద్దరు కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాలో వెలుగుచూసింది. పుదుకోట్టై జిల్లా సెంబాటూర్ సమీప ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కొడుకులు విఘ్నేశ్వరన్(22), యోగేశ్వరన్(19) ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలు విడిపోయారు. దీంతో కొడుకులతో కలిసి ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. Also Read: స్థానికంగా వడ్డీ వ్యాపారం చేసే ఆమెకు అదే ప్రాంతానికి చెందిన షణ్ముగం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. షణ్ముగం అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి రాసలీలలు సాగించేవాడు. ఈ క్రమంలోనే అతడికి పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు కొడుకులు పద్ధతి మార్చుకోవాలని తల్లిని మందలించారు. అయినా పట్టించుకోని ఆమె ప్రియుడితో సంబంధం కొనసాగిస్తూనే ఉంది. కుటుంబసభ్యులు, బంధువుల నుంచి ఒత్తిడి పెరగడంతో నగదు, నగలు తీసుకుని ప్రియుడితో ఎక్కడికో వెళ్లిపోయింది. Also Read: ఈ విషయం స్థానికంగా అందరికీ తెలిసిపోవడంతో విఘ్నేశ్వరన్(22), యోగేశ్వరన్(19) తీవ్ర మనస్తాపం చెందారు. ‘మీ అమ్మ ఎవరితోనే వెళ్లిపోయిందంటగా’ అంటూ అందరూ అడుగుతుండటాన్ని తట్టుకోలేకపోయారు. శనివారం ఉదయం గదిలో నుంచి అన్నదమ్ములు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు చూడగా ఉరేసుకుని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం పుదుకోట్టై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:
By June 14, 2020 at 10:26AM
No comments