Breaking News

సెల్‌ఫోన్ కొనలేదని ఆత్మహత్య చేసుకున్న యువతి.. కోరుకొండలో విషాదం


సెల్‌ఫోన్‌ కొనివ్వలేదన్న కోపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కోరుకొండకు చెందిన ఓ యువతి సూరంపాలెంలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్‌ చదువుతూ తల్లి, అన్నయ్యతో కలిసి ఉంటోంది. తండ్రి గతంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. వారం రోజుల కిందట కుటుంబ సభ్యుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంలో అన్నయ్య ఆమె సెల్‌ఫోన్‌ను నేలకేసి కొట్టడంతో పగిలిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన చెల్లిని ఓదార్చేందుకు రెండ్రోజుల్లో కొత్త ఫోన్ కొనిస్తానని అతడు చెప్పాడు. అయితే తనకు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నందున వెంటనే ఫోన్ కొనాలని ఆమె పట్టుబట్టింది. Also Read: ఎంత బ్రతిమాలినా అన్నయ్య కొత్త ఫోన్ కొనకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాసేపటి తర్వాత ఆమెను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్సై డి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షణికావేశంతో ఆమె తీసుకున్న నిర్ణయం ఆ తల్లికి కడుపుకోత మిగిల్చింది. Also Read:


By June 02, 2020 at 07:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/btech-student-commits-suicide-in-east-godavari-district-over-family-disputes/articleshow/76146937.cms

No comments