Breaking News

పుల్లల కోసం వెళ్లిన పదేళ్ల బాలికపై రేప్.. ప్రకాశం జిల్లాలో దారుణం


అభం శుభం తెలియని బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. గుడ్లూరు మండలంలోని ఓ గ్రామంలో పదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యేబు అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రులు మామిడి తోటల్లో కాపలా కోసం నెల్లూరు జిల్లా కావలిలో ఉంటున్నారు. దీంతో ఆమె నాయనమ్మ దగ్గర ఉంటూ స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం ఎండు పుల్లల కోసం గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లిన బాలికపై యేబు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: చిన్నారి ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళన పడిన నాయనమ్మ, మేనత్తు చెరువు వద్దకు వెళ్లగా బాలిక కేకలు వినిపించాయి. వారిని చూసి యేబు బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు. బాధితురాలి నాయనమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కందుకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డీఎస్పీ శ్రీనివాసులు మంగళవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యేబు నెల్లూరులో బేల్దారి పనులు చేస్తుంటాడని, రెండ్రోజుల క్రితమే గ్రామానికి వచ్చాడని పోలీసులు తెలిపారు. Also Read:


By June 03, 2020 at 09:58AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/10-yr-old-girl-raped-by-neighbour-in-prakasam-district/articleshow/76168352.cms

No comments