Breaking News

తిరుపతిలో దారుణం... గంజాయి మత్తులో దాడి


చిత్తూరు జిల్లాలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. తాజాగా తిరుపతిలో యువకులు గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. స్థానిక తాతయ్యగుంటకు చెందిన కొందరు యువకులు గంజాయి సేవించి దారినపోయే ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. కత్తితో వెంకటసాయి అనే యువకుడిపై దాడికి దిగారు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు అతడ్ని కాపాడారు. చుట్టుపక్కల వారు గమనించి గాయపడ్డ యువకుడ్ని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు షరా మామూలు అయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి వారిని కట్టడి చేయాలని కోరుతున్నారు. వెంకటసాయిపై దాడికి పాల్పడిన ఆరు మంది యువకులపై తిరుపతి ఈస్ట్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


By June 01, 2020 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/young-man-attacked-by-ganga-gang-at-tirupati/articleshow/76129547.cms

No comments