సరిహద్దుల్లో ఘర్షణ.. ఆ రోజు ఏం జరిగింది?: బయటపెట్టిన ఉపగ్రహ చిత్రాలు!

సరిహద్దుల్లో వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ ఎలా చోటుచేసుకుందనేది ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టాయి. వాస్తవాధీన రేఖ నుంచి కొద్ది కిలోమీటర్ల దూరంలోని 14వ నెంబరు పెట్రోలింగ్ పాయింట్ వద్ద ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఎల్ఏసీ వద్ద చైనావైపు భారీగా బలగాలను మోహరించినట్టు శాటిలైట్ చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఈ ప్రాంతం నుంచి చైా దళాలు గాల్వన్ లోయలోని భారత భూభాగంలోకి చేరుకుని 15,000 అడుగుల ఎత్తులో వందలాది మంది సైనికులు సోమవారం ఘర్షణ పడ్డారు. భారత సైనికులపై ఇనుప రాడ్లు, ఇనుప తీగలతో చుట్టిన కర్రలతో దాడిచేయగా.. మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ఘర్షణ అర్ధరాత్రి వరకు కొనసాగినట్టు వీటిని బట్టి తెలుస్తోంది. లడఖ్లో భారత-చైనా ఘర్షణలో సైనికులు ఎత్తైన శిఖరం నుంచి కిందన ఉన్న గాల్వన్ నదిలోకి దూకినట్టు ఉపగ్రహ చిత్రాలు తెలియజేస్తున్నాయి. అలాగే, చైనా అంబులెన్స్లు ఈ ప్రాంతంలో మృతదేహాలను, గాయపడిన సైనికులు తీసుకెళ్లడాన్ని భారత సైనికులు గమనించారు. హెలికాప్టర్లు వారిని ఇతర ప్రాంతాలకు తరలించాయి. మరోవైపు, సైనిక సంఘర్షణ జరిగిన గల్వాన్ లోయపై భారత దళాలు ఇప్పటికీ పట్టుకోల్పోలేదని ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. మారణ హోమం జరిగిన 24 గంటల్లోపు తీసిన హై రెజల్యూషన్ ఉపగ్రహ చిత్రాలు గల్వాన్ వద్ద క్షేత్రస్థాయి పరిస్థితిని కళ్లకుకడుతున్నాయి. అక్కడ భారత్ కన్నా చైనా దళాలు భారీ సంఖ్యలో మోహరించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికీ అక్కడ చైనాకు చెందిన 200కి పైగా సైనిక వాహనాలు, చెక్పోస్టులు ఉన్నట్లు కనిపిస్తోంది. దీన్నిబట్టి సైనిక బలగాల ఉపసంహరణ నియమాలను చైనా యథేచ్ఛగా ఉల్లంఘించి భారత్ను మోసం చేసినట్లు సుస్పష్టంగా అర్థమవుతోంది. అయితే 20మంది సైనికులను కోల్పోయినా, పదుల సంఖ్యలో జవాన్లు గాయపడినా భారత దళాలు వెనక్కు తగ్గలేదని, గల్వాన్ లోయపై పట్టు నిలుపుకున్నాయని ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది.
By June 18, 2020 at 09:29AM
No comments