Breaking News

అక్రమ సంబంధం వద్దన్న కూతురు.. చంపేసి ఇంట్లోనే పాతిపెట్టిన తల్లి


కోసం నవమాసాలు మోసి కనిపెంచిన కూతురినే కడతేర్చిందో కసాయి తల్లి. పరాయి వ్యక్తితో కొనసాగిస్తున్న లైంగిక సంబంధం గురించి తెలుసుకున్న కూతురు పద్ధతిగా ఉండాలని చెప్పడాన్ని జీర్ణించుకోలేని కిరాతకురాలు మరో ఇద్దరితో కలిసి చంపేసింది. ఆరేళ్ల తర్వాత ఈ కేసును కొలిక్కి తెచ్చిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తిరుప్పూర్‌ జిల్లా వీరపాండి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఓ వ్యక్తితో వివాహం చేయగా.. వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు. భర్తతో విబేధాల కారణంగా 2014లో ఆమె పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. Also Read: తన తండ్రి లేని సమయంలో ఓ వ్యక్తి తరుచూ ఇంటికి వచ్చి తల్లితో రాసలీలలు కొనసాగించడాన్ని కూతురు చేసింది. ఈ వయసులో ఇలాంటి పనులు చేసి కుటుంబ పరువు తీయకంటూ ఆమె తల్లిని మందలించింది. ఈ నేపథ్యంలోనే 2014, జూన్‌ 14న కూతురు కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే చెన్నైలో ఉంటున్న బావమరిది తన ఇంటికి వచ్చినప్పుడే కూతురు అదృశ్యమైందని ఇటీవల ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. Also Read: దీంతో పోలీసులు అతడి బావమరిదిని అరెస్టు చేసి విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న కూతురిని తన అక్క ప్రియుడితో కలిసి చంపేసిందని, దానికి తాను కూడా సాయం చేసినట్లు చెప్పాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తించకుండా ఇంట్లోనే పాతిపెట్టినట్లు వెల్లడించారు. దీంతో మహిళతో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలంలో తవ్వగా లభించిన ఎముకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. Also Read:


By June 26, 2020 at 10:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-kills-daughter-with-help-of-boyfriend-in-tamil-nadu/articleshow/76637686.cms

No comments