భారత్లో కరోనా విజృంభణ.. ఒక్క రోజులో అత్యధిక కేసులు

భారత్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో తక్కువగా నమోదైన కేసులు.. అన్లాక్ దశలో భారీగా పెరిగాయి. గత 24 గంటల్లోనే దేశంలో 15,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 465 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ తొలి వారంలో రోజుకు పదివేల లోపు కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం రోజుకు 16 వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1.83 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. 2,58,685 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ మన దేశంలో కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,476కు చేరింది. మహారాష్ట్రలో 1.39 లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 6531 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 66,602 మంది, తమిళనాడులో 64,603 మంది కోవిడ్ బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 93.54 లక్షలు దాటాయి. ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడిన వారిలో 50 లక్షల మందికిపైగా కోలుకోగా.. దాదాపు 4.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
By June 24, 2020 at 11:56AM
No comments