Breaking News

రూ.500 కోట్లకు ప్రజలను ముంచినోడు.. భార్య చేతిలో దారుణ హత్య


కొన్నాళ్ల క్రితం మనీ బ్యాక్ పాలసీ రాకెట్ స్కీమ్‌ పేరుతో ప్రజల నుంచి రూ.500 కోట్లు దోచుకున్న ప్రభాకరన్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లో భార్య చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. చెన్నైకి చెందిన ప్రభాకరన్‌ అలియాస్‌ క్రిస్టి(50), సుకన్య(32) భార్యాభర్తలు. వారికి ముగ్గురు పిల్లలు. చెన్నైలో మనీ బ్యాక్‌ పాలసీ రాకెట్‌ కేసులో పోలీసులు అతడిని 2012లో అరెస్ట్ చేశారు. 8 నెలల తర్వాత బెయిల్‌‌పై బయటకు వచ్చిన ప్రభాకరన్ హైదరాబాద్‌‌కు వచ్చేసి మౌలాలిలోని ఆండాల్ నగర్‌లో ఉంటున్నాడు. అదే కేసులో 2013లో అతడి భార్యను సుకన్యను కూడా సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో పిల్లలను ప్రభాకరన్‌ తన తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. Also Read: 2018లో బెయిల్‌పై విడుదలైన సుకన్యకు భర్త జాడ తెలియలేదు. దీంతో ఆమె పిల్లలను తీసుకుని చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. ఇటీవలే తన భర్త హైదరాబాద్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్న ఆమె ఈ నెల 18న మౌలాలి ఆండాల్ నగర్‌కు వచ్చింది. భార్య, పిల్లలతో కలిసి సడెన్‌గా రావడంతో ప్రభాకరన్ షాకయ్యాడు. ఆమెతో కలిసి జీవించడం ఇష్టం లేదని, తిరిగి వెళ్లిపోవాడని బెదిరించాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తపై కక్ష పెంచుకున్న సుకన్య ఈ నెల 23న రాత్రి నిద్రపోతున్న అతడి మొహంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపేసింది. Also Read: మరుసటి రోజు ఉదయం తన భర్త నిద్రలోనే కన్నుమూశాడని అందరికీ చెప్పింది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొందరు స్థానికులు మల్కాజ్‌గిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సుకన్యను అదుపులోకి తీసుకుని విచారించగా తానే భర్తను చంపినట్లు అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By June 28, 2020 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-arrested-for-kills-husband-in-hyderabad-thier-involved-in-rs-500-crore-scam-in-tamil-nadu/articleshow/76669143.cms

No comments