Breaking News

పంజాబ్ టు ఏపీ: కృష్ణా జిల్లాలో రూ.35లక్షల విలువైన మద్యం పట్టివేత


కృష్ణా జిల్లాలో భారీగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను అధికారులు శనివారం పట్టుకున్నారు. మైలవరం మండలంలోని కీర్తిరాయుని గూడెం గ్రామంలో నిల్వ చేసిన సుమారు రూ.35 లక్షల విలువైన రాష్ట్రానికి చెందిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌‌మెంట్ అడిషనల్ ఎస్పీ మోకా. సత్తిబాబు ఆధ్వర్యంలో దాడులు జరిపి స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని కంకిపాడులో మద్యం కేసులో పట్టుబడిన నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు కీర్తిరాయునిగూడెంలో అతని సోదరుడు వీరంకి అయినబాబు ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. Also Read: ఈ సందర్భంగా 8 వేల బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యం అలవాటును తగ్గించాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఇటీవల మద్యం ధరలు భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీంతో కొందరు అక్రమార్కులు పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు మద్యాన్ని కొనుగోలు చేసి గుట్టుగా రాష్ట్రంలోకి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలపై నిఘా పెట్టిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అనేక ప్రాంతాల్లో సోదాలు చేపట్టి భారీగా మద్యం నిల్వలను సీజ్ చేస్తున్నారు. Also Read:


By June 14, 2020 at 07:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/police-seize-worth-of-rs-35-lakhs-liquor-in-krishna-district/articleshow/76365644.cms

No comments