Breaking News

24 గంటల్లో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాని రాష్ట్రంఇదే


దేశవ్యాప్తంగా కరనా మహమ్మారి విజృంభిస్తున్నది. కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 5,48,318కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,475కి పెరిగింది. 2,10,120 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,21,723 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు సంఖ్య వేలల్లో రికార్డ్ అవుతున్నాయి . మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ప్రతిరోజు భారీ సంఖ్యలో కొత్తకేసులు నమోదవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తున్నది. అయితే, మిజోరంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఈ వివరాలను వెల్లడించింది. మిజోరం ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 151కి చేరింది. అందులో 61 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 90 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలావుంటే కరోనా వైరస్ కారణంగా మిజోరంలో ఇప్పటివరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. మరోవైపు రేపటి నుంచి అన్‌లాక్-2 మొదలు కానున్న నేపథ్యంలో కేంద్రం సోమవారం రాత్రి సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసారి లాక్‌డౌన్ ఆంక్షలను మరిన్ని సడలించింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, ముందస్తు అనుమతులు, ఈ-పర్మిట్ల అవసరం లేకుండానే ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చని స్పష్టం చేసింది. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.


By June 30, 2020 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/no-new-covid-19-cases-in-mizoram-on-monday/articleshow/76702655.cms

No comments