Breaking News

Vizag: ఏడో తరగతిలోనే హద్దులు దాటిన బాలిక.. గర్భం వస్తుందేమోనని..


ప్రేమో.. వ్యామోహమో తెలియని వయస్సులో ఆకర్షణకు లోనైన బాలిక హద్దులు దాటి అర్థాంతరంగా తనువు చాలించింది. స్కూల్లో తోటి విద్యార్థితో ప్రేమలో పడిన బాలిక.. అతనితో శారీరకంగా దగ్గరైంది. ఆ తరువాత ఏదో అయిపోతోందన్న అనుమానంతో మానసికంగా కుంగిపోయింది. తెలిసీ తెలియని వయస్సులో చేసిన తప్పుకి ఎక్కడ గర్భం వస్తుందేమోనన్న భయంతో ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో వెలుగుచూసింది. విశాఖ వెస్ట్ పరిధిలోని మల్కాపురానికి చెందిన బాలిక(14) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో చదువుతున్న సహ విద్యార్థితో ప్రేమలో పడింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ వయస్సులో తెలియని ఆకర్షణతో అతనికి శారీరకంగా దగ్గరైంది. అప్పటి వరకూ బాగానే ఉన్నా.. ఆ తరువాత ఆమెలో అనుమానం బయల్దేరింది. Also Read: తాను చేసిన తప్పుకి గర్భం వస్తుందేమోనని భయపడింది. అదే అనుమానంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ హుక్కుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె ఉరికి వేలాడుతూ కనిపించడంతో హతాశులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కి తరలించారు. Read Also:


By May 29, 2020 at 11:20AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/class-7-girl-commits-suicide-in-visakhapatnam/articleshow/76085109.cms

No comments