Breaking News

దేశంలో ఆగని కరోనా విజృంభణ.. పాజిటివ్ కేసుల్లో ఇరాన్‌‌కు ఒక్క అడుగు దూరంలో


మహమ్మారి తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. గడచిన ఆరు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు సగటున 5,500 దాటి నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాపత్ంగా 6,7378 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మరో 144 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసులు ఇంత పెద్ద సంఖ్యలో నమోదుకావడం ఇది ఐదోసారి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1.31 లక్షలు దాటింది. పాజిటివ్ కేసులు లక్ష దాటిన ఐదు రోజుల్లోనే మరో 31వేలు కేసులు కొత్తగా నిర్ధారణ కావడం కలవరానికి గురిచేస్తోంది. కరోనా మరణాలు కూడా వారం రోజుల నుంచి సగటున రోజుకు 130పైగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కరోనాతో 3,870 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ శనివారం కొత్తగా మరో 2,608 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 47,190కి చేరింది. మరణాల్లోనూ మహారాష్ట్ర టాప్‌లో ఉంది. ఇప్పటి వరకూ అక్కడ 1,577 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో మహమ్మారి విజృంభణ మామూలుగా లేదు. శనివారం మరో 759 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 15,512కి చేరింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తర్వాత ఢిల్లీ 591, మధ్యప్రదేశ్ 282, ఉత్తరప్రదేవ్ 282, రాజస్థాన్ 248, బీహార్ 228, కర్ణాటక 216, ఉత్తరాఖండ్ 92 కేసులు కొత్తగా నిర్ధారణ అయ్యాయి. శనివారం 27 రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు నమోదుకావడం దేశవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి చెందిందనడానికి సంకేతం. సిక్కిమ్‌లో తొలిసారిగా ఓ పాజిటివ్ కేసు నమోదయ్యింది. ఇప్పటి వరకూ అక్కడ కరోనా కేసు నమోదు కాకపోవడంతో వైరస్ ఫ్రీ స్టేట్‌గా ఉంది. ముంబయి నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య 28,634కి చేరింది. మహరాష్ట్రలో శనివారం 60 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇందులో 42 మరణాలు ముంబయిలోనే చోటుచేసుకున్నాయి. మహారాష్ట్రలో విధుల నిర్వహణ పోలీసులకు కత్తిమీద సామే అవుతోంది. అక్కడ 1,671 మంది పోలీసులు కరోనా వైరస్‌ బారినపడగా, 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర నుంచి ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్‌ వెళ్లిన కూలీల్లో 9 మందికి, ముంబయి నుంచి ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్న వారిలో ఐదుగురికి వైరస్‌ సోకిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా కరోనా నుంచి 54,385 మంది కోలుకోగా.. మరో 73వేల మందికిపైగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.


By May 24, 2020 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/new-coroanvirus-cases-rise-to-6778-days-toll-144-in-india/articleshow/75934091.cms

No comments